. సిరా న్యూస్,
విశాఖపట్నంలో విద్యార్థులు రెచ్చి పోయారు. రెండు గ్రూపులుగా విడిపోయిన ఓ కాలేజీ స్టూడెంట్స్ బాజీ జంక్షన్ సమీపంలో పరస్పరం దాడి చేసుకున్నారు.ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. దీంతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ఘటనపై పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థులు ఒకరిపై ఒకరు రాళ్లు, కర్రలతో దాడి చేసుకోవడంతో చాలా మంది గాయపడ్డారు. ట్రాఫిక్ జామ్ కారణంగా ప్రయాణికులు గంటల తరబడి ట్రాఫిక్ లోనే చిక్కుకుపోయారు.విద్యార్థులు ఒకరిపై ఒకరు రాళ్లు, కర్రలు విసు రుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో గందరగోళం, భయాందోళనలు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపు లోకి తెచ్చేందుకు పోలీసులు వెంట నే స్పందించి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఘర్షణ వెనుక కారణాలు ఇంకా తెలియలేదు. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యర్థి వర్గం తమపైనే ముందు దాడి చేశారంటూ విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.