సిరాన్యూస్, ఓదెల
నేత్రదాత అప్పని చంద్రయ్యకు సంస్కరణ సభ
నేత్రదాత అప్పని చంద్రయ్యకు సంస్మరణ సభను పెద్దపల్లి జిల్లా ఓదెలలోని వారి స్వగృహంలో సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి డాక్టర్ భీష్మాచారినేత ఆధ్వర్యంలో నిర్వహించారు. బంధు మిత్రులకు, నేత్ర అవయవ శరీర దానాలపై అవగాహన కల్పించారు. అలాగే ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించిన భార్య రాయమల్లమ్మ, కుమారుడు కోడలు స్వామి -రాజమణి, కుమారుడు సందీప్ కు జ్నాపికను అందజేశారు. సమాజహితం కోరి నేత్రదానం చేసిన కుటుంబ సభ్యులకు క్యాతం మల్లేశం, బైరి వినోద్, మేరుగు సారంగం, జీడి.నవీన్ అప్పని, తిరుపతి రామినేని కొమరయ్య అభినందనలు తెలిపారు. సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు శ్రవణ్ కుమార్ ప్రధాన కార్యదర్శి లింగమూర్తి జాతీయ కార్యదర్శి డాక్టర్ భీష్మాచారినేత,ముఖ్య సలహాదారులు నూక రమేష్, గౌరవ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి, ప్రచార కార్యదర్శి వాసు, పృథ్విరాజ్,నరహరి,లగిశెట్టి చంద్రమౌళి అభినందనలు ధన్యవాదాలు తెలిపారు.