సిరా న్యూస్,ఖమ్మం;
ఖమ్మం రూరల్ జాన్ బాద్ తండాలో విషాదం నెలకొంది. తండాకు చెందిన రైతు ఏలేటి వెంకటరెడ్డి (46) తన పొలాన్ని వేరే వ్యక్తి ఆక్రమించి సాగు చేస్తున్నాడని పొలం వద్దె పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. ఖమ్మంలోని శ్రీ రక్ష హాస్పిటల్ లో నాలుగు రోజులుగా చికిత్స పొందుతు తెల్లవారుజామున వెంకట్ రెడ్డి మృతి చెందారు. తన భూమిని జాటోత్ వీరన్న అనే వ్యక్తి కబ్జా చేసి దౌర్జన్యంగా భూమిని దున్నుతుండగా దానిని చూసి తట్టుకోలేక మనస్థాపానికి గురై పొలం వద్దే ఈనెల 4వ తేదీన సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగుతూ వెంకట్ రెడ్డి బాధను వ్యక్తం చేశాడు ఖమ్మం రూరల్ పోలీసులకు పలుమార్లు చెప్పినా పట్టించుకోలేదని జాటోత్ వీరన్న దౌర్జన్యంగా తన భూమిని కబ్జా చేసి సాగు చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తూ పొలం వద్దనే పురుగుల మందు తాగడంతో కుటుంబ సభ్యులు వెంకటరెడ్డిని ఆస్పత్రికి తరలించారు.మూడు రోజులు పాటు మృత్యువుతో పోరాడిన వెంకటరెడ్డి బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు.