సిరా న్యూస్,మేడ్చల్;
గ్రేటర్ శివారు ప్రాంతాల్లో దొంగలు హదలెత్తిస్తున్నారు. దేవాలయాలు, బంగారం షాపులే టార్గెట్ గా చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా సైబరాబాద్ పోలీసు కమిషనరేట్, శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని తూంకుంటలో భారీ చోరికి పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. తూముకుంట రాజీవ్ రహదారి పక్కనే ఉన్న కృష్ణ జ్యువలరీ షాపులో ఈ రోజు తెల్లవారు జామున చోరి జరిగింది. షాపులోని సుమారు 480గ్రాముల బంగారం, 80 కిలోల వెండి ఆభరణాలు, లక్షన్నర వరకు నగదు దొంగలు ఎత్తుకపోయినట్లు షాపు యజమాని గణేష్ బర్ఫా తెలిపారు. షాపులో ఉన్న సీసీ కెమెరాల పుటేజి దొరుకకుండా హార్డ్ డిస్క్ కూడా దొంగలు ఎత్తుకు పోయారని గణేష్ తెలిపారు. అయితే ఐదు వివిధ విభాగాల పోలీసులతో టిం లుగా ఏర్పడి దొంగల కోసం గాలిస్తున్నామని త్వరలోనే దొంగలను పట్టుకుంటామని మేడ్చల్ అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డి తెలిపారు.