సిరాన్యూస్, కుందుర్పి
తల్లిపాలు బిడ్డకు శ్రేయస్కరం : ఐసీడీఎస్ సూపర్వైజర్ సుశీలమ్మ
పుట్టిన నాటి నుంచి తల్లి పాలు ఇవ్వడం బిడ్డ ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరమని ఐసీడీఎస్ సూపర్వైజర్ సుశీలమ్మ అన్నారు. బుధవారం కుందుర్పి మండల పరిధిలోని అల్లాపురం గ్రామంలోని అంగన్ వాడీ సెంటర్లో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐసిడిఎస్ సూపర్ వైజర్ సుశీలమ్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పుట్టిన బిడ్డకు ముర్రపాలు తల్లిపాలు శ్రేయస్కరమని అన్నారు.బిడ్డ ఆరోగ్యం గా ఎదగడానికి తీసుకోవాల్సిన జాగత్రలు గురించి ఆమె బాలింతలకు,గర్భవతులకు సూచించారు కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకుని అమూల్యమైన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. అంతకుముందు తల్లిపాల వారోత్సవాల గోడ పత్రికలను స్థానిక టీచర్లు నరసమ్మ,ఓ లక్ష్మీదేవి,ఎల్ కె.కుమారి, విజయమ్మ, దేవి రమ్మ,ఏ ఎన్ ఎం మమత,ఎం ఎల్ హెచ్ పి రజిని మహిళా పోలీస్ సునీత ఆశా కార్యకర్తలు స్థానిక నాయకులు ఈరన్న విరుపాక్షి హనుమంతరాయుడు డీలర్ తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు.