సిరా న్యూస్,కోరుట్ల;
అవయవదానంపై సరైన అవగాహన లేకపోవడం కారణంగా…. ఏ కారణంగా చనిపోయినా మనం మట్టిలో కలిసిపోతున్నామే కానీ, మరొకరి జీవితాన్ని నిలపవచ్చని ఆలోచన లేదని, మనం మట్టిలో కలిసిపోక ముందే మన అవయవాలను మరికొందరికి దానం చేసి ప్రాణం పోయేవచ్చనని అమ్మ నేత్ర అవయవ దాన ప్రోత్సాహకుల సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు గంజి ఈశ్వర లింగం, పసుపులేటి రమాదేవి వైస్ ప్రెసిడెంట్, సమన్వయకర్త బి.వి. కె కిషోర్ ఆన్నారు .. బుధవారం స్ధానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో
అమ్మ నేత్ర అవయవ దాన ప్రోత్సాహకుల సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవయవ దాన 179 వ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా అమ్మ నేత్ర అవయవ దాన ప్రోత్సాహకుల సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు గంజి ఈశ్వర లింగం, పసుపులేటి రమాదేవి వైస్ ప్రెసిడెంట్, సమన్వయకర్త బి.వి. కె కిషోర్ లు నేత్ర,అవయవ ,శరీర దానము యొక్క ప్రాముఖ్యతను వివరించారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడారు అవాయవ దానం వల్ల ఒకరు పదుల సంఖ్యలో జీవితాలను నిలబెట్ట వచ్చనే నిజం మనలో చాలామందికి తెలియదని, అవయవ దానంపై సరైన అవగాహన లేకపోవడమే కారణంగా ..ఏ కారణంగా చనిపోయిన మనం మట్టిలో కలిసిపోతున్నామే కానీ, మరొకరికి జీవితాన్ని నిలపవచ్చునని ఆలోచన లేదన్నారు. అవయవదానం పై మనలో చాలామందికి సరైన అవగాహన లేదని, నిజానికి ఏ వయసు వారైనా అవయవదానం చేయవచ్చు అన్నారు. 18 ఏళ్లు లోపు వారు తల్లిదండ్రుల అనుమతితో ఈ బృహత్ కార్యక్రమంలో పాల్గొనవచ్చునని తెలిపారు.. ఆనంతరం
కళాశాల ఇంచార్జీ ప్రిన్సిపల్ డాక్టర్ వి. ముత్యం రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు అందరూ కూడా అవయవ దానము కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు.. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు సిహెచ్ విశ్వనాథం, కళాశాల బోధన, బోధనేతర సిబ్బంది, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.