బంగ్లాలో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం

సిరా న్యూస్,ఢాకా;
రాజకీయ సంక్షోభంలో ఉన్న బంగ్లాదేశ్‌లో పరిస్థితులు చక్కదిద్దేందుకు ఇవాళ కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. నోబెల్ బహుమతి గ్రహీత మహ్మద్‌ యూనస్‌ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం రాత్రి 8 గంటలకు కొలువు దీరింది. పారీస్‌లో ఉన్న యూనర్‌ స్వదేశానికి చేరున్నారు. ఆయన చేరుకున్న తర్వాత 15 మందితో సలహా మండలి ఏర్పాటు చేశారు. వీళ్లకు సైన్యం కూడా సహకరించేందుకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. బంగ్లాదేశ్‌ ప్రజలకు యూనస్‌ ఓ సందేశాన్ని పంపించారు. ప్రజలంతా శాంతియుతంగా ఉండాలని సూచించారు. దేశాన్ని ప్రగతి పథంలోకి తీసుకెళ్లేందుకు ఇదో గోప్ప అవకాశమని చెప్పుకొచ్చారు. ఇలాంటి పరిస్థితిల్లో హింసను ప్రేరేపిస్తే బాగోదని హితవు పలికారు. సామాన్య ప్రజలకు విద్యార్థులు, పార్టీలు అన్నీ శాంతియుతంగా ఉండి దేశాభివృద్ధిలో భాగమవ్వాలని కోరారు.
మరోవైపు బంగ్లాదేశ్‌లో హింస మాత్రం ఆగడం లేదు. సైనిక పాలన సాగుతున్న వేళ లూటీలు జరుగుతున్నాయి. అవామీ లీగ్ నాయకులను టార్గెట్ చేసుకుంటున్నారు ఆందోళనకారులు. వారిని వెతికిపట్టుకొని దాడులు చేస్తున్నారు. చిత్రవధ చేసి చంపేస్తున్నారు. ఇలా డజన్ల మందిని హత్య చేసినట్టు మీడియా చెబుతోంది. కొన్ని రోజులుగా హింసకు బలైన వారి సంఖ్య దాదాపు ఐదు వందలకు చేరుకుంది. భారతీయులతోపాటు ఇతర దేశీయులను టార్గెట్ చేసుకుంటున్నారు అల్లరి మూకలు. దీనిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. జానపద కళాకారుడు రాహుల్ ఆనంద ఇంటిని నేల మట్టం చేశాయి అల్లరి మూకలు. లూటీ చేసి ఆయన ఇంట్లో ఉన్న వస్తువులను ఎత్తుకుపోయారు. సంగీత పరికరాలకు నిప్పు పెట్టారు. విషయాన్ని ముందే తెలుసుకున్న ఆయన కుటుంబంతో కలిసి ఎటో వెళ్లిపోయారు. ఇలా ఇళ్లపైనే కాదు పోలీసు స్టేషన్లపై కూడా దాడులు జరుగుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి భయానక వాతావరణంలో పని చేసేందుకు పోలీసులు రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మహమ్మద్‌ యూనస్‌కు కఠిన సవాళ్లు ఎదుర్కోనున్నాయి. పేదల బ్యాంకర్‌గా పేరున్న ఆయన ఏం చేస్తారని ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. లక్షల మందిని పేదరికం నుంచి తప్పించిన యూనస్ ఇప్పుడు దేశాన్ని ఎలా గట్టెక్కిస్తారనే ప్రశ్న చాలా మందిలో ఉంది.మరోవైపు హింసాత్మక పరిస్థితులు ఉన్నందున చాలా మంది బంగ్లాదేశీయులు ఆ దేశం విడిచిపెట్టి భారత్‌లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా మంది భారత్‌, బంగ్లాదేశ్ సరిహద్దు వద్దకు చేరుకొని తమ రాకకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. బెంగాల్‌లోని జల్‌పాయిగుడీ జిల్లాకు వందల మంది బారులు తీరారు. అక్కడ జరుగుతున్న దారుణాలు వివరిస్తున్నారు. ఎవర్నీ అనుమతి ఇచ్చేది లేదని భారత్ సైన్యం స్పష్టం చేస్తోంది. 4,096 కిలోమీటర్ల సరిహద్దు ప్రాంతం వెంబడి భారత్‌ కట్టిదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. సరిహద్దు వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు కేంద్రం పర్యవేక్షిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *