ఎమ్మెల్సీ దువ్వాడ ఇంటి ముందు కన్న కూతుళ్లు పడిగాపులు

సిరా న్యూస్,శ్రీకాకుళం;
శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కూతుళ్లు తండ్రిని కలిసేందుకు ఇంటి ముందర పడిగాపులు కాచారు.దీంతో శ్రీనివాస్ ఇంటి వద్ద అలజడి నెలకొంది . దువ్వాడ శ్రీనివాస్ కుమార్తెలు తమ కుటుంబసభ్యులతో కలిసి గురువారం రాత్రి దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ఆవరణలో వేచి ఉండడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. గత కొంత కాలంగా దువ్వాడ కుటుంబంలో అంతర్గత విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన ఇంటి ఆవరణలో కుమార్తెలు వేచి ఉండటం పై ఆసక్తి చోటుచేసుకుంది. తన తండ్రిని కలిసేందుకు వచ్చిన ఇద్దరు కూతుళ్లు గంటల తరబడి ఇంటి బయట కార్లో వేచి ఉన్నప్పటికీ దువ్వాడ శ్రీనివాస్ కనీసం ఇంటి గేటు తెరవడంలేదు…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *