ప్రపంచ ఆదివాసీ దినోత్సవ ర్యాలీ

పాల్గోన్న ఎమ్మెల్యే
సిరా న్యూస్,రాజమండ్రి;
ప్రాచీనచరిత్రకు, సంస్కృతికీ, సంప్రదాయాలకు, నిరాడంబరతకు నిలువుటద్దంగా నిలిచే జీవన శైలి ఆదివాసుల సొంతం.. ప్రకృతి మాత బిడ్డలైన గిరిపుత్రులకు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ తూర్పు గోదావరి జిల్లా వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ జిల్లా స్థాయి వేడుకలలో భాగంగా రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ నుండి కంబాల చెరువు వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పాల్గోన్నారు..
తరువాత ఆదివాసీ సాంప్రదాయ నృత్యం చేస్తున్న విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే నృత్యం చేసి అందరినీ ఆశ్చర్యపరిచి విద్యార్థుల్లో మరింత ఉత్సాహాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో ఎన్డీయే కూటమి నాయకులు, సంబంధిత జిల్లా అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *