సిరాన్యూస్, జైనథ్
కాంగ్రెస్ చేరిన జైనథ్ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు
ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికల పరంపర కొన సాగుతోంది. మరి కొద్ది రోజుల్లో జరగనున్నస్థానిక సంస్థల ఎన్నికల సందర్భంలో జరుతున్న చేరికలతో కాంగ్రెస్ పార్టీలో జోష్ కనిపిస్తోంది. తాజాగా ఇవాళ అల్లూరి అశోక్ రెడ్డి , అడ్డి రుకేష్ రెడ్డి ఆధ్వర్యంలో జైనథ్ మండల ఆదవాసీ ప్రధాన్ ల అధ్యక్షుడు కోవ ప్రభాకర్ నేతృత్వంలో బీఆర్ఎస్ నుండి దాదాపు యాభై మంది కార్యకర్తలు కంది శ్రీనివాస రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బేల మండల అధ్యక్షులు ఫైజల్లా ఖాన్,మాజీ జడ్పీటీసీ రాందాస్ నాక్లే,కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్,లోక ప్రవీణ్ రెడ్డి,పద్మశాలి సంఘం తాలూకా అధ్యక్షులు బొమ్మకంటి రమేష్,పద్మశాలి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బూర్ల శంకరయ్య,కౌన్సిలర్లు సంద నర్సింగ్,రామ్ కుమార్, తూర్పుటి భూమన్న,మున్సిపల్ కో.ఆప్షన్ మెంబర్ ఇజ్జగిరి సంజయ్ కుమార్,నాయకులు ఎం.ఏ కయ్యుమ్,బండి దేవిదాస్ చారి,బాసా సంతోష్,కుంట కిష్ట రెడ్డి,రాజేశ్వర్,పోరెడ్డి కిషన్,యాల్ల పోతా రెడ్డి,సూర్యభాన్,గంభీర్ టాక్రే,ఇరిగేల అశోక్,ఇరిగేల కిరణ్,గజంగుల రమేష్,అనుముల ఉదయ్ కిరణ్,కొండూరి రవి,శ్రీ రామ్,విష్ణు,తల్లెల రాకేష్,దర్శనాల చంటి,అఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు.