సిరాన్యూస్,భీమదేవరపల్లి
విజయ దండోర యాత్ర ను విజయవంతం చేయండి
* ఎమ్మార్పీఎస్ హుస్నాబాద్ నియోజకవర్గం ఇన్చార్జి మాట్ల వెంకటస్వామి
ఈనెల 13న నిర్వహించే విజయ దండోర యాత్ర ను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి మాట్ల వెంకటస్వామి అన్నారు. శనివారం భీమదేవరపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మందకృష్ణ మాదిగకు పెద్ద ఎత్తున స్వాగతం పలకాలని మాదిగలకు, మాదిగ ఉపకులాలకు పిలుపునిచ్చారు. సమావేశంలో రాష్ట్ర మహిళా ఎమ్మార్పీఎస్ అధ్యక్షురాలు జేపీ లత మాదిగ, ఎమ్మార్పీఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ మంద రాజు మాదిగ, హనుమకొండ జిల్లా ఎంఎస్పీ అధ్యక్షులు బండారు సురేందర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు శాంతి కుమార్ మాదిగ పాల్గొన్నారు.