సిరా న్యూస్,నల్లగొండ;
అడవిదేవుల పల్లి మండలం దున్న పోతుల గండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును మంత్రి ఉత్తమ్ పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా మిర్యాలగూడ ప్రజలతో నాకు అనుబంధం ఉంది ఈ ప్రాంత ప్రజలకు ఎంతో సేవ చేశాం. ఎంతో కాలంగా లిఫ్టు లు పెండింగ్ ఉన్నాయి. సాగర్ నిండటం శుభ పరిణామం, రెండు పంటలకు నీటికి కొదవ లేదు. సాగర్ పరిదిలో పెండింగ్ కాల్వల పనులకు వెంటనే నిధులు కేటాయించి, నూటికి నూరు శాతం పూర్తి చేస్తాం. 490 కొట్ల నిధులు వెంటనే విడుదల చేస్తాం. వచ్చే స్వాతంత్ర దినోత్సవం నాటికి 5 లిఫ్ట్ ల పనులు పూర్తి చేయాలి. ప్రభుత్వము నుండి ఎటువంటి ఇబ్బందులూ లేకుండా చూసుకుంటాం. అదికారులు చిత్త శుద్ధి తొ పనిచేయాలని అన్నారు.