సిరా న్యూస్,నల్గోండ;
నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం చిట్యాల వద్ద ఇరిగేషన్ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిని బాల్నేపల్లి చిట్యాల గ్రామస్తులు అడ్డుకున్నారు. టైల్ పాండ్ ప్రాజెక్టు నిర్వాసితుల కింద తమకు ఇల్లు నష్టపోయిన పరిహారం తదితర సమస్యలు నెరవేర్చకపోవడంతో అడ్డగించారు. తాగునీరు అందించడం లేదని ఇళ్లల్లోకి పాములు తేళ్లు వస్తున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేసారు.