సిరాన్యూస్, ఓదెల
గడ్డం రాజయ్య కుటుంబానికి 50కేజీ బియ్యం అందజేత : మల్లిఖార్జున స్వామి దర్మకర్త డాక్టర్ సతీష్
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రానికి చెందిన గడ్డం రాజయ్య అనారోగ్యం కారణాలతో ఇటీవల మృతి చెందారు. సోమవారం బాధిత కుటుంబాన్ని ఓదెల మల్లిఖార్జున స్వామి దర్మకర్త డాక్టర్ సతీష్ పరామర్శించారు. అనంతరం 50కేజీల బియ్యాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బోయ సదానందం, గడ్డం శ్యాం,రాచెర్ల కిషన్, సతీష్, రాజు, మహేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.