Kalyandurgam Ayyappaswamy : శరవేగంగా సాగుతున్న అయ్యప్పస్వామి సేవా మండపం పనులు

సిరాన్యుసు, కళ్యాణదుర్గం
శరవేగంగా సాగుతున్న అయ్యప్పస్వామి సేవా మండపం పనులు

కళ్యాణదుర్గం పట్టణంలో స్ధానిక విద్యానగర్ లో ఉన్న‌ శ్రీ హరిహర పుత్ర అయ్యప్పస్వామి దేవాలయం ఆలయ ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న‌ సేవా మండపం పనులు పూర్తి కావస్తున్నాయి. ప్రస్తుతం సేవా మండపం టాప్ వేయడానికి‌ సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ప్రతిసంవత్సరం అయ్యప్ప స్వామి మండల పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు సేవా మండపం నిర్మిస్తున్నట్లు ఆలయ గురుస్వామి వెంకటేశులు తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు  దాతలు , భక్తాధుల సహకారంతో మండపాన్ని నిర్మించడం జరిగిందని అన్నారు. మిగిలిన పనులు కూడా మాలధారణలు మొదలు అయ్యే లోపల పూర్తి చేస్తామని ఆలయ అభివృద్ధి కోసం విరాళాలు ఇచ్చేదాతలు ఆలయ కమిటీ సభ్యులను‌ సంప్రదించాలని‌ వారు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *