సిరా న్యూస్, ఆదిలాబాద్ (ఎడ్యుకేషన్):
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సేవలనుస ద్వినియోగం చేసుకోవాలి…
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సేవలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దూరవిద్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎం.ఏ. తెలుగు క్లాసులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులు, అధ్యాపకులతో కలిసి మాట్లాడారు. ప్రతీ ఆదివారం దూరవిద్య కేంద్రంలో తరగతులు నిర్వహించడం జరుగుతుందని, అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులంతా తప్పక హాజరు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ఆర్ శ్రీనివాస్, ప్రతాప్ సింగ్, ఇతర విద్యార్థులు పాల్గొన్నారు.