సిరా న్యూస్,తిరుమల;
తిరుమల మొదటి ఘాట్రోడ్డులో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఆదివారం రాత్రి మొదటి ఘాట్రోడ్డులోని 55, 56 మలుపు సమీపంలో చిరుత రోడ్డు దాటి అడవిలోకి వెళ్లడాన్ని వాహనచోదకులు గుర్తించారు. వెంటనే తితిదే భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు. శేషాచలం అడవిలో చిరుతల సంచారం అధికంగా ఉండడంతో తరచూ ఘాట్రోడ్లలో కనిపిస్తున్నాయి