PADAGALA Ravinder : సమగ్ర శిక్ష ఉద్యోగులను ఆదుకోవాలి : టీఎస్ఎస్‌జేఏసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పడగల రవీందర్

సిరాన్యూస్‌, బేల‌
సమగ్ర శిక్ష ఉద్యోగులను ఆదుకోవాలి : టీఎస్ఎస్‌జేఏసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పడగల రవీందర్

సమగ్ర శిక్షలో వివిధ హోదాలో పనిచేసి మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ సమగ్ర ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పడగల రవీందర్ డిమాండ్ చేశారు..ఈ మేరకు సోమవారం రాష్ట్ర కమిటీ మేర‌కు ఆదిలాబాద్ జిల్లా బేల మండ‌లంతో పాటు ఆయా మండల వనరుల కేంద్రాల్లో మృతుల చిత్రపటాలను నివాళులు అర్పించి మౌనం పాటించారు. ఈసంద‌ర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మృతి చెందిన ఉద్యోగులకు 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల్లోని ఎమ్మార్పీ, సి ఆర్సీ, కేజీబీవీ ఉద్యోగులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *