సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
కలెక్టర్కు వినతి అందజేసిన సీవైఎస్ఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శీతాల్కర్ అరవింద్
ప్రతి సంవత్సరం అక్రమ డిప్యూటేషన్లను ప్రోత్సహిస్తున్న డీఈఓ పై చర్యలు తీసుకోవాలి సీవైఎస్ఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శీతాల్కర్ అరవింద్ అన్నారు. సోమవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఫిర్యాదుల విభాగంలో కలెక్టర్కు సీవైఎస్ఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శీతాల్కర్ అరవింద్ వినతి పత్రం అందజేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ నిర్మల్ జిల్లా విద్యాధికారి ఎ. రవీందర్ రెడ్డి ప్రతి సంవత్సరం అక్రమ డిప్యూటేషన్లు ప్రోత్సహిస్తున్నారని, తద్వారా పెంబి మండలం లోని గిరిజన గ్రామాలు విద్య కు దూరం అవుతున్నాయని తెలిపారు. సమగ్ర విచారణ జరిపి ఎంఈఓ మధుసూదన్, జిల్లా విద్యాధికారి పై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరామన్నారు. దీనికి కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలిపారు.