జోగి రమేష్ పాత్ర పై విచారణ జరుగుతుంది

ఎసిబి అడిషనల్ ఎస్పీ సౌమ్యలత
సిరా న్యూస్,విజయవాడ;
అగ్రిగోల్డ్ భూముల విషయంలో అవకతవకలు జరిగాయి. అగ్రిగోల్డ్ భూముల సర్వే నెంబర్ ను కూడా మార్చారు. ఎసిబి అధికారుల విచారణ లో అవకతవకలు నిజమని తేలాయని ఎసిబి అడిషనల్ ఎస్పీ సౌమ్యలత అన్నారు. సిఐడి అధికారుల నివేదిక ను కూడా తెప్పిస్తున్నాం. అగ్రిగోల్డ్ ఆస్తులు సిఐడీ అటాచ్ మెంట్ లో ఉన్నాయి. మా విచారణ లో పిసీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశాం. ప్రభుత్వ అధికారులు ఈ కేసులో దోషులుగా ఉన్నారు.
అందుకే మా విచారణ వేరుగా సాగిస్తున్నాం. సిఐడీ, ఎసిబి అధికారుల విచారణ నివేదికలు ఉన్నతాధికారులు కు వివరిస్తాం. మా దర్యాప్తు లో ఐదుగురు పేర్లు ఉన్నాయి… విచారణ లో మరికొన్ని పేర్లు ఉండొచ్చని అన్నారు. జోగి రమేష్ పాత్ర పై విచారణ జరుగుతుంది.. నిర్దారణ అయితే కేసు నమోదు చేస్తాం. 87 సర్వే లో ఎలాంటి సబ్ డివిజన్ లు జరగలేదు. అవ్వా శేష నారాయణ ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించాం. అక్రమ రిజిస్ట్రేషన్ లు జరిగాయని తేలాకే కేసు నమోదు చేశాం. 88 సర్వే లో స్థలం కొని, 87 సర్వే లో ఉందని మార్పు చేసుకున్నారు. ఇదంతా ఒక కుట్ర ప్రకారమే జరిగింది. గ్రామ, మండల సర్వేయర్ల ను మేనేజ్ చేశారు. సర్వేయర్ రమేష్, జోగి రాజీవ్ లను ఇప్పటి వరకు అరెస్టు చేశామని అన్నారు.

One thought on “జోగి రమేష్ పాత్ర పై విచారణ జరుగుతుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *