BJP Paidipelli Prithviraj Goud: ప్రజల్లో దేశ భక్తిని నింపడమే లక్ష్యం:  బీజేపీ మండల అధ్యక్షులు పైడిపెల్లి పృథ్విరాజ్ గౌడ్

సిరాన్యూస్‌, భీమదేవరపల్లి
ప్రజల్లో దేశ భక్తిని నింపడమే లక్ష్యం:  బీజేపీ మండల అధ్యక్షులు పైడిపెల్లి పృథ్విరాజ్ గౌడ్
* ముల్కనూర్లో హర్ ఘర్ తిరంగా ర్యాలీ

ప్రజల్లో దేశ భక్తిని నింపడమే లక్ష్యమ‌ని బీజేపీ భీమదేవరపల్లి మండల అధ్యక్షులు పైడిపెల్లి పృథ్విరాజ్ గౌడ్ అన్నారు. బుధ‌వారం భీమదేవరపల్లి మండ‌లంలోని ముల్కనూర్ లో ఎస్ఆర్‌టీ జూనియర్ కాలేజ్, మోడల్ జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ తో జాతీయ వాదులు జాతీయ జెండాలను పట్టుకొని ప్రజా గ్రంధాలయం నుండి అంబేద్కర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంత‌రం అంబేద్కర్ విగ్ర‌హానికి పూల మాలలు వేసి నివాళుల‌ర్పించారు. తదనంతరం జనగణ మన జాతీయ గీతం ఆలాపించారు. ఈసంద‌ర్బంగా బీజేపీ మండల అధ్యక్షులు పైడిపెల్లి పృథ్విరాజ్ గౌడ్ మాట్లాడుతూ దేశ స్వతంత్రం కోసం ఎంతోమంది ప్రాణాలు అర్పించార‌న్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వ‌హించ‌డం ద్వారా ప్రజల్లో దేశభక్తిని పెంపొందించడానికి ఉపయోగపడతాయని తెలిపారు. ఆగస్టు 15వ తేదీ ప్రతి ఒక్కరూ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి జాతీయ భావాన్ని వ్యక్త పరచాలని కోరారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు దొంగల కొమురయ్య, దుర్గసింగ్, మాచర్ల కుమార్, గండు సారయ్య, ఊసకోయిల కిషన్, శ్రీరామోజు శ్రీనివాస్, మ్యాకల రాజు, తీగల రాజు, పిల్లి రవీందర్, అయిత సాయి, రాణా ప్రతాప్, శనిగరపు ఐలయ్య, మల్లారెడ్డి, సంపత్, గద్ద రాజేందర్, సింగం రాజేందర్, వికాస్, వీరన్న, సోప్పరి నవీన్, ఉదయ్, పొన్నం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *