సిరా న్యూస్,రంగారెడ్డి;
నార్సింగీలో దారుణం జరిగింది. రాజు (50) అనే బార్బర్ ను అతి కిరాతకంగా మరో బార్బర్ గొంతు కోసి హత్య చేసాడు. హత్య చేసి నేరుగా నార్సింగి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు నిందితుడు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాల తో హత్య జరిగినట్లు సమాచారం. హత్య చేసిన వ్యక్తి బందువుగా గుర్తించారు.