సిరాన్యూస్, జైనథ్
జోగురామన్నను పరామర్శించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్
మాజీ మంత్రి జోగురామన్న సోదరుడు జోగు పోతారెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ బాధిత కుటుంబాన్ని బుధవారం జైనథ్ మండలం దీపాయిగూడ గ్రామంలో వారి నివాసంలో పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రితో మాట్లాడి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అంతకుముందు జోగు పోతారెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్యే పుష్పాంజలి ఘటించారు. ఎమ్మెల్యే వెంట బీజేపీ నాయకులు ఆదినాథ్, విజయ్, అంకత ,రమేష్, రత్నాకర్ రెడ్డి, దీపాయిగుడా ఎంపీటీసీ కరుణాకర్ రెడ్డి, విశ్వనాథ్, తదితరులున్నారు.