తుమ్మ రాజ్ కుమార్..*
సిరా న్యూస్,కమాన్ పూర్;
సుల్తానాబాద్ పట్టణం లో బందుకు హిందూ సమాజం ఈనెల 16న పిలుపునివ్వడం జరిగినది.
బంగ్లాదేశ్ లో జరుగుతున్న హిందూ దేవాలయాలపై మరియు హిందువులపై దాడులకు నిరసనగా హిందువుల ఐక్యత చాటడం కోసం హిందువులంతా ఏకం కావడం కోసం హిందూ శక్తి ప్రపంచాన్ని తెలపడం కోసం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో భాగంగా సుల్తానాబాద్ పట్టణంలో 16 తేదీన శుక్రవారం నాడు బంద్ కి పరిపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నట్టు యువ సంకల్ప ఫౌండేషన్ అధ్యక్షులు తుమ్మ రాజ్ కుమార్ ఒక ప్రకటన తెలిపారు. పట్టణంలో ఉన్న వాణిజ్య వ్యాపార విద్య మరియు తదితర సంస్థలు స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొని మన దేశ సమగ్రతను హిందువుల ఐక్యతను చాటి చెప్పాలని ప్రతి ఒక్కరు ఈ బందులో భాగ్యసాములు కావాలని కోరుకోవడం జరిగినది మన సుల్తానాబాద్ అంటే ఐక్యతకు నిలుయమంటూ తెలిపే విధంగా పూర్తిస్థాయిలో బంద్ చేయాలని కోరడం జరిగినది ఇలాంటి సంఘటనలు మరెక్కడ హిందువులపై జరగకుండా ఉండేలా యావత్ ప్రపంచానికి తెలియజెప్పే విధంగా ఈ బంద్ నిర్వహించి మన ఐక్యతను చాటుదామని తుమ్మ రాజ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.