పల్సి-బి లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు…

 సిరా న్యూస్, తలమడుగు: 

పల్సి-బి లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు…
అదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం పల్సి-బి గ్రామంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం మాజీ మంత్రులు జోగు రామన్న, గూడెం నగేష్ లతో కలిసి గ్రామంలోని విఠలేశ్వరుని ఆలయాన్ని సందర్శించారు. అంతకుముందు స్థానిక నాయకులు, గ్రామస్తులతో కలిసి గ్రామంలో కబడ్డీ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ… గెలుపోటములతో సంబంధం లేకుండా క్రీడా స్ఫూర్తితో ఆడాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించడం సంతోషకరమని అన్నారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భోజనం చేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్తులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *