MLA Vedma Bojju Patel: కాంగ్రెస్ ప్ర‌భుత్వం పేదలకు అండ:  ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

సిరాన్యూస్‌, దస్తురాబాద్
కాంగ్రెస్ ప్ర‌భుత్వం పేదలకు అండ:  ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
* సీఎంఆర్ఎఫ్ చెక్కులు అంద‌జేత‌

నిరు పేద కుటుంబాలకు ఆపద సమయంలో సీఎంఆర్ఎఫ్ పథకం అండగా నిలుస్తోందని,పేషంట్ ఆపరేషన్ కు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు.బుధవారం నిర్మల్ జిల్లా దస్తురాబాద్‌ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ చేతుల మీదుగా 11 మంది లబ్ధిదారులకు 330,000లక్షల విలువలు గల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు. సీఎంఆర్ఎఫ్ పథకం వల్ల పేద ప్రజలకు ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు.ఆపద సమయంలో పేషంట్ ఆపరేషన్ కు అయ్యే ఖర్చును సీఎంఆర్ఎఫ్ తక్షణ సహాయం కింద ఎల్ఓసీ ద్వారా నిధులను మంజూరు చేయడం జరుగుతుందోన్నారు.ఆపదలో ఉన్న రోగులకు సీఎంఆర్ఎఫ్ పథకం సంజీవినిలా పని చేస్తోందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్వచ్చదనం-పచ్చదనం కార్యక్రమాన్ని చేపడుతోందన్నారు.వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని,నిత్యం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.ప్రతి ఇంటితో పాటు ప్రభుత్వ, ప్రవేటు కార్యాలయాలలో మొక్కలను నాటాలన్నారు. చెట్లను పెంచితేనే మానవ మనుగడ సాఫీగా సాగుతుందని తెలిపారు.టైర్లలో కొబ్బరి చిప్పలలో, ట్యాంకులలో నిరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. నిరు నిల్వ ఉంటే డెంగ్యూ, మలేరియా,టైపాయిడ్, కలరా లాంటి వ్యాధుల బారిన పడతామని, ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు,లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *