సిరా న్యూస్, నిర్మల్:
సునీల్ బన్సల్ సమీక్షా సమావేశంలో పాల్గొన్న .. అజ్మీరా అత్మరామ్ నాయక్..
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అజ్మీరా అత్మరామ్ నాయక్ నేడు ఉమ్మడి జిల్లా అసెంబ్లీ ఎన్నికల సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు సునీల్ బన్సల్ అధ్యక్షతన నిర్మల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో అసెంబ్లీ ఎన్నికల సమీక్ష, జిల్లాలో గెలుపోటముల పై చర్చ జరిగాయి. రాబోయే రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక కార్యక్రమాలను గురించి చర్చించారు.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమెందర్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు శ్రీ సోయం బాపురవ్ గారు, ఎమ్మెల్యేలు రామారావు పటేల్, పాల్వాయి హరీష్ బాబు, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పయల్ శంకర్, రాథోడ్ రమేష్ గారు, ఉమ్మడి జిల్లా నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు…