సిరా న్యూస్, రాజన్న సిరిసిల్ల:
బీఆర్ఎస్కు బిగ్ షాక్..
+ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న తంగళ్లపల్లి జడ్పిటీసీ బీఆర్ఎస్కు రాజీనామ
+ కాంగ్రేస్లో చేరనున్నట్లు వార్తలు
రాష్ట్రంలో అధికారం కోల్పోయి, ప్రతి పక్ష హోదాలో కూర్చున్న బీఆర్ఎస్కు మరో షాక్ తగలింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న తంగళ్లపల్లిమ మండల జడ్పిటీసీ పుర్మాణి మంజుల, ఆమె భర్త పుర్మాణి లింగారెడ్డితో కలిసి బీఆర్ఎస్కు గుడ్బై చెప్పారు. ఈ మేరకు తన రాజీనామ పత్రాన్ని సిరిసిల్ల బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య రాజన్నకు సమర్పించారు. కాగా బీఆర్ఎస్ తరపున ఆమె రెండు సార్లు జడ్పిటీసీగా గెలుపొందారు. గతంలో జడ్పీ చైర్మెన్ పదవి కోసం ప్రయత్నాలు చేసినప్పటికీ, అదిష్ఠానం నుంచి ఆమెకు చుక్కెదురైంది. అయితే తాము గత 20 సవత్సరాలుగా పార్టీ కోసం పనిచేస్తున్నామని, అయినప్పటికీ పార్టీలో సరైన గుర్తింపు లేకపోవడం, కొంత మంది నాయకుల ఒంటెద్దు పోకడలతో విసిగిపోయి పార్టీకీ రాజీనామ చేస్తున్నట్లు వారు తెలిపారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రేస్ గాలి వీయడం, స్పష్టమైన మెజార్టీతో కాంగ్రేస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వాన్ని నెలకొల్పడంతో పుర్మాణి దంపతులిద్దరూ కాంగ్రేస్లో చేరేందుకే బీఆర్ఎస్కు రాజీనామ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. రేపో మాపో వారు కాంగ్రేస్ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. అయితే కేటీఆర్ స్వంత నియోజక వర్గంలోనే బీఆర్ఎస్ను దెబ్బకొట్టడంతో, రాష్ట్ర వ్యాప్తంగా చేరికలు జోరందుకునేలా కాంగ్రేస్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు సైతం దెగ్గర పడుతుండటంతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రేస్లో భారీగా వలసలకు ఇది సంకేతమని విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.