సిరా న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పుసుగూడెంకు సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. అయనకు జిల్లా కలెక్టర్ జితీశ్ వి పాటిల్,జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ తదితరులు స్వాగతం పలికారు. ములకలపల్లి మండలం పూసుగూడెంలో సీతారామ ఎత్తిపోతల పంప్ హౌస్ కు చేరుకున్న సీఎంకు అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. రెండవ పంప్ హౌస్ సందర్శన అనంతరం..రెండవ పంప్ హౌస్ వద్ద పైలాన్ ఆవిష్కరించి, స్విచ్ ఆన్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. డిస్పాచ్ ఛానల్ వద్ద గోదావరి జలాలకు పుష్పాలను జల్లి స్వాగతం పలికిన ఎం.రేవంత్,ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల,పొంగులేటి,ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వాగతం పలికారు. ప్రాజెక్టును ప్రారంభించి రైతాంగానికి అంకితం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
సీఎం మాట్లాడుతూ గత 10ఏళ్లుగా బీజేపీ ఈ దేశంలో అధికారంలో ఉంది. ఈ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది, ప్రగతికి పునాదులు వేసింది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ మత తత్వ పార్టీ. బీజేపీ అరాచకాలు మనం 10 ఏళ్లుగా చూస్తున్నాం. హర్ ఘర్ తిరంగ అని మోడీ ఒక క్యాంపెయిన్ మొదలు పెట్టారు. దేశ భక్తి ఉన్నట్లు బీజేపీ సర్టిఫై చేస్తుందట. ఈ దేశానికి స్వాతంత్ర్యాన్ని, జాతీయ జెండాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ అవమానించింది. మూడు రంగుల జెండాను గౌరవించం అని చెప్పింది. ఒకే రంగు ఉండాలి అని చెప్పారు.. హిందువులు గౌరవించరు అని చెప్పారు. 2001 వరకు ఆర్ఎస్స్ పార్టీ ఆఫిస్ లో జాతీయ జెండా ను ఎగరవేయలేదు. నిజానికి ఈ దేశానికి మోడీ చేసింది ఏమీ లేదు. హర్ గర్ ను మోడీ మోసం చేశారు. ప్రతి కుటుంబానికి ఒక ఇల్లు అని మోసం చేశాడు. ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం అని మోసం చేశారు. ప్రతి రైతు కుటుంబాన్ని ఆదుకుంటాం అని మోసం. ఆంధ్ర రాష్ట్రంలో హర్ గర్ దోకా చేశారు. మణిపూర్ లో ఊచ కోత కోశారు. ఆంధ్రలో కూడా ప్రతి ఘర్ ను మోసం చేశాడు. ప్రత్యేక హోదా ఇస్తామని మోసం చేశాడు. విభజన హామీలను ఒక్కటి కూడా అమలు చేయలేదని అన్నారు.
ఇవ్వాళ ఆంధ్రలో ప్రతి ఇంటిని మోసం చేశాడు. ఇవ్వాళ దేశంలో రాజ్యాంగం ప్రమాదంలో పడింది. రాజ్యాంగాన్ని మారుస్తాం అని అంటున్నారు. ఇవ్వాళ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అనుకుంటే కాంగ్రెస్ అధికారంలో రావాలి. మన రాజ్యాంగం కాపాడాలి అంటే కాంగ్రెస్ అధికారంలో రావాలి. ఈ దేశంలో ఐక్యత మళ్ళీ రావాలి అంటే…ప్రగతికి పునాదులు పడాలి అంటే కాంగ్రెస్ అధికారంలో రావాలి. కాంగ్రెస్ రాకుంటే ఈ దేశం ఇబ్బందులు పడుతుంది. రాహుల్ జగన్ కలుస్తారు అనే విషయం అవాస్తవమని అన్నారు.