సిరా న్యూస్,శ్రీకాళహస్తి ;
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి సినీ నటుడు మహేష్ సతీమణి నమత్రా శిరోద్కర్ గురువారం కుటుంబ సభ్యులతో కలసి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి విచ్చేశారు వారికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుదీర్ రెడ్డి,సతీమణి బొజ్జల రిషితా రెడ్డి స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి రుద్రాభిషేకం లో పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక రాహు-కేతు పూజలు నిర్వహించుకున్నారు.శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శించుకున్నారు.శ్రీ మృత్యుంజయ స్వామి సన్నిధానం వద్ద మహేష్ బాబు కుటుంబ సభ్యులను వేద పండితుల చే ప్రత్యేక ఆశీర్వచనం,ఎమ్మెల్యే బొజ్జల సుదీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితా రెడ్డి శేషవస్తంతో సత్కరించి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వామి, అమ్మవార్ల చిత్రపటాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో ఇఓ ఎస్ ఎన్ ఎస్ మూర్తి,దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్,సూపర్డెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ మరియు ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.