కలెక్టర్ రాహుల్ శర్మ.
సిరా న్యూస్,జయశంకర్ భూపాలపల్లి;
అన్ని పాఠశాలల విద్యార్థులకు, వసతి గృహల్లోని విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడిఓసి కార్యాలయంలో వైద్య, పంచాయతి రాజ్, మున్సిపల్, సంక్షేమ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి రోజు.పరీక్షలు నిర్వహణలో వ్యాధులు ప్రబలిన విద్యార్థులు వివరాల నివేదికలు అందచేయాలని ఆదేశించారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య పరీక్షలు పెంచాలని సూచించారు. వ్యాధులు ప్రబలే కాలమని వైద్య సిబ్బంది సమయ పాలన పాటించాలని ఆదేశించారు. అన్ని ప్రైవేట్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలను తనిఖీ చేయాలని, వైద్య పరీక్షల ధరల పట్టిక ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలని సర్క్యూలర్ జారీ చేయాలని వైద్యాధికారిని ఆదేశించారు. నిరంతర తనిఖీలు నిర్వహిస్తూ వైద్య సేవలు పర్యవేక్షణ చేయాలని సూచించారు. మలేరియా, డెంగీ జ్వరాలు ప్రబలిన. ప్రాంతాల్లో ఇంటి సమీపంలో ని ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించాలని, వ్యాధులు. ప్రబల కుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని తెలిపారు. మలేరియా, డెంగీ కిట్లు అందుబాటులో ఉంచాలని, ఎలీసా పరీక్షలు నిర్వహించాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే క్రమ శిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మురుగు నీరు, నీటి నిల్వ ప్రాంతాల్లో దోమలు వ్యాప్తి జరుగకుండా ఫాగింగ్, ఆయిల్ బాల్స్ వేయాలని సూచించారు. కుక్కల వృద్ధి నియంత్రణకు కు.ని శస్త్ర చికిత్సా కేంద్రాన్ని వినియోగంలోకి తేవాలని, ఏర్పాటులో ఎందుకు జాప్యం జరుగుతోందని మున్సిపల్. కమిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోనో కార్పస్ మొక్కలు తొలగిస్తున్న సందర్భంగా వాటి స్థానంలో పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడే మొక్కలు నాటాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అటవీ అధికారి సునీత,
అదనపు కలెక్టర్ వేముకటేశ్వర్లు, డిపిఓ నారాయణ రావు, వైద్యాధికారి డా మధుసూదన్, మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్ రావు, బిసి సంక్షేమ అధికారి శైలజ, ఎస్సి అభివృద్ధి అదికారి సునీత, డిఆర్డీఓ నరేష్, జడ్పి సీఈవో విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.