సెప్టెంబర్ 3న కార్మిక మహా ప్రదర్శన బహిరంగ సభ
సిరా న్యూస్,బద్వేలు;
కేంద్రంలోని ఎన్డీఏ మోడీ ప్రభుత్వం కార్మికుల పట్ల అవలంబిస్తున్న విధానాల పైన చర్చించేందుకు విశాఖపట్నంలో సెప్టెంబర్1,2,3, తేదీలలో ఏఐటీయూసీ జాతీయ సమితి సమ్మేళనాలను జయప్రదం చేయాలని రైల్వే గూడ్స్ షేడ్ హమాలీ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు కేసి.బాదుల్లా, ఎస్.మహబూబ్ బాషా లు విజ్ఞప్తి చేశారు.శుక్రవారం స్థానిక కడప రైల్వే స్టేషన్ లోని గూడ్స్ షేడ్ హమాలీ యూనియన్ కార్యాలయం యందు ఏఐటీయూసీ జాతీయ సమితి సమ్మేళనాలకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేయడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బిజెపి మోడీప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకి దేశసంపదలోని రైల్వేలు, విమానాశ్రయాలు, పోర్టులు,బొగ్గు గనులను కారు చౌకగా అప్పజెప్తున్నారని వారు విమర్శించారు.కార్మికులు ఎన్నో (ఆశేష) పోరాటాలు,త్యాగాలు చేసీ సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లుగా మార్చి కార్మిక హక్కులను కాలరాస్తున్నారు అని వారు విమర్శించారు.ప్రభుత్వ గూడ్స్ షేడ్ ల యందు హమాలీ లక్ష్యలాది కార్మికులకు భద్రత కల్పించకుండా వారి శ్రమను దోపిడీ చేస్తున్నారని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని పదేళ్లు పరిపాలన చేసిన బిజెపి ప్రభుత్వం దేశంలో నిరుద్యోగ సమస్యను పేదరికం పెంచి పోషిస్తున్నారని బిజెపి విధానాల వలన ఈ దేశంలో ఉన్నటువంటి సంపదంత కూడా బడా కార్పొరేట్ చేతుల్లోకి పోవడం వల్ల దేశంలో ఆర్థిక వ్యత్యాసాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.దేశ స్వతంత్రం కోసం పోరాడిన చరిత్ర కలిగినటువంటి ఏకైక జాతీయ కార్మిక సంఘం ఏఐటీయూసి ని స్వతంత్రానికి పూర్వమే బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని కూడగట్టి కార్మిక హక్కుల కోసం అనేక సమ్మెలు పోరాటాలుచేసిన చరిత్ర కలిగినటువంటి ఏఐటీయూసీ జాతీయ సమితి సమావేశాలు సెప్టెంబర్ 1,2,3 తేదీల్లో విశాఖపట్నంలో జరుగుతున్నాయన్నారు.ఈ ఏఐటీయూసీ జాతీయ సమితి సమావేశంలో దేశవ్యాప్త కార్మిక సమస్యలను చర్చించి భవిష్యత్ కార్యాచరణని రూపొందించుకోవడం జరుగుతుందని సెప్టెంబర్ 3న విశాఖపట్నంలో జరుగు మహాకార్మిక ప్రదర్శన, బహిరంగ సభకు జిల్లాలోని ఉద్యోగులు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రైల్వే గూడ్స్ షేడ్ హమాలీ యూనియన్ నాయకులు పాల్, చిన్న ఓబులేసు,నాగేంద్ర,గంగయ్య, సూరి, రంగనాయకులు,మళ్లి, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కే.లింగన్న, నగర అధ్యక్షులు సుబ్బరాయుడు, నాయకులు దస్తగిరి, సునీల్ తదితరులు పాల్గొన్నారు.