సిరా న్యూస్,హైదరాబాద్;
గవర్నర్ కోటలో ఎమ్మెల్సీగా ఎన్నికైన ప్రొపెసర్ కోదండరాం ,అమీర్ అలీ ఖాన్ ర్లతో తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శుక్రవారం తన ఛాంబర్ లో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , పొన్నం ప్రభాకర్ , సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీలు మహేష్ కుమార్ గౌడ్ , విప్ బిర్లా ఐలయ్య , ఎమ్ యస్ ప్రభాకర్ రావు , లేజిస్లేచర్ సెక్రెటరీ డా’ నరసింహా చార్యులు , తదితరులు పాల్గొన్నారు.