Saidapur: సైదాపూర్‌లో కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం

సిరాన్యూస్‌,సైదాపూర్:
సైదాపూర్‌లో కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం
* మహిళలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలి
* కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దొంత సుధాకర్

మహిళలపై మాజీ మంత్రి కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సైదాపూర్ మండల కేంద్ర కూడలి వద్ద ఆయన దిష్టిబొమ్మను శుక్రవారం దహనం చేశారు. ఈసంద‌ర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దొంత సుధాకర్ మాట్లాడారు. మహిళలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంత‌కు ముందు రైతుల పంటరుణాలలో భాగంగా 2లక్షల రుణమాఫీ చేసినందుకు గాను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ కు సైదాపూర్ మండల కాంగ్రెస్ నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు. బాణాసంచా కాల్చి కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. కార్య‌క్ర‌మంలో బ్లాక్ కాంగ్రెస్ కిష్టయ్య, జిల్లా అధికార ప్రదినిధి మేకల రవీందర్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మల్లయ్య, గ్రామశాఖ అధ్యక్షులు రాజు, యాదగిరి, సంపత్, కిషన్ నాయక్, రాజు, లక్ష్మణ్, ఇంద్రసేన, విద్వాన్ రెడ్డి, రాజకుమార్, కొమురయ్య, బొమ్మగాని రాజు, మ్యాకల రాజు, గుంటి స్వామి, తిరుపతి, ఎర్రల శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *