MP Nagesh: అటల్ బిహారీ వాజపేయి సేవ‌లు మరులేనివి:  ఎంపీ న‌గేష్‌

సిరాన్యూస్‌,ఆదిలాబాద్‌
అటల్ బిహారీ వాజపేయి సేవ‌లు మరులేనివి:  ఎంపీ న‌గేష్‌

నిరంతరం ప్రజల కోసం పరితపించిన నాయకుడు, దేశం గర్వించదగ్గ మహా మనిషి మాజీ ప్రధాని, భారత రత్న అటల్ బిహారీ వాజపేయి అని ఆదిలాబాద్ ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. అటల్ బిహారీ వాజపేయి వర్ధంతి కార్యక్రమాన్ని శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈసంద‌ర్భంగా వారు మాట్లాడుతూ మారుమూల గ్రామాలకు రోడ్ సౌకర్యం కల్పించిన ఘనత వాజ‌పేయి దక్కుతుందన్నారు. దేశం గర్వించదగ్గ మహా మనిషి అటల్ బియారీ వాజపేయి అని కొనియాడారు. ప్రపంచ రాజకీయాలకే ఆయన ఆదర్శమని, అధికారం కోసం తాపత్రయపదకుండా ప్రజా సేవకు పాటు పడ్డారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు లాలా మున్నా, ఆకుల ప్రవీణ్, జోగు రవి, దినేష్ మాటోరియా, మహేందర్, ముకుందరావు, రాజు, సతీష్ తదిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *