సిరా న్యూస్,హైదరాబాద్;
పొలిటికల్గా రచ్చరేపిన ఎల్ఆర్ఎస్ విషయంలో ఎట్టకేలకు ముందడగు పడింది. 2020లో క్రమబద్దీకరణ కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లకు మరో అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పేక మేడలు కాదు. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్. నగరంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అక్రమ కట్టడాల కూల్చివేతల పర్వం మొదలైంది. హైడ్రా ఆపరేషన్ అక్రమార్కుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది.మరోవైపు లే -అవుట్ రెగ్యూలరైజేషన్ స్కీమ్.. ఎల్ఆర్ఎస్ పై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. లే అవుట్స్, ప్లాట్స్ క్రమబద్దీకరణకు మరో ఛాన్స్ ఇచ్చింది. కాకపోతే కండీషన్స్ అప్లయ్. 2020 అక్టోబర్ 15లోపు దరఖాస్తు చేసుకున్న వాళ్లకే క్రమబద్దీకరణ అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు సంబంధిత అధికారులు. 131, 135 జీవో నెంబర్ల ప్రకారం రాష్ట్రాల అక్రమ లే-అవుట్స్, ప్లాట్స్ రెగ్యూలరైజషన్ కోసం 2020లో నియమ నిబంధనలు జారీ అయ్యాయి.2020 ఆగస్టు26 కన్నా ముందు రిజిష్టర్ చేసిన లే అవుట్లకు మాత్రమే ఎల్ఆర్ఎస్ వర్తిస్తుందని స్పష్టం చేశారు. గైడ్లైన్స్ 2020లోనే విడుదలైనా దరఖాస్తుల పరిశీలన గత జనవరి నుంచే మొదలైంది. ఇప్పటి వరకు 4లక్షల 28వేల 832 అప్లికేషన్లను స్క్రూట్నీ చేశారు. 60 వేల 2వందలకు పైచిలుకు దరఖాస్తులకు ఆమోద ముద్ర పడింది. తద్వారా ఫీజుల రూపేణ సర్కార్ ఖజానాలో 96 కోట్ల 60 లక్షలు జమయ్యాయిమరి మిగతా అప్లికేషన్ల మాటేంటి? దాదాపు 75 శాతం దరఖాస్తులకు ఆమోద ముద్రం పడకపోవడానికి కారణం..సరైన డాక్యుమెంట్లు సమర్పించకపోవడం..సమగ్ర వివరాలు పొందుపర్చకపోవడం.అలాంటి వారికి ఇప్పుడు మరో అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సేల్ డీడ్, ఈసీ, మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్ , లే-అవుట్ కాపీలను జతపరిస్తే మళ్లీ ఆ దరఖాస్తులను పరిశీలిస్తారు. మొబైల్ ద్వారా కూడా డాక్యుమెంట్స్ను అప్లోడ్ చేయవచ్చు. లేదంటే మున్పిపాల్టీలు, కార్పొరేషన్లు, అర్బన్ డెవలప్మెంట్ అథార్టీ ఆఫీసుల్లో స్వయంగా ఇవ్వొచ్చు. సలహాలు సూచనల కోసం హెల్ప్ డెస్క్లను కూడా ఏర్పాటు చేశారు అధికారులు.కాంగ్రెస్ సర్కార్ అధికార పగ్గాలు చేపట్టిన కొత్తలోనే ఎల్ఆర్ఎస్ పై రాజకీయ రచ్చ రాజుకుంది. అధికారంలోకి రాగానే ల్యాండ్ రెగ్యూలరైజేషన్ను ఫ్రీగా చేస్తామన్న హామీని నిలపెట్టుకోవాలని బీఆర్ఎస్ ఆందోళనలు చేపట్టింది. మరోవైపు, మాటేంటే మాటేనన్న కాంగ్రెస్ సర్కార్ ఎల్ ఆర్ ఎస్ అమలు కోసం విధి విధానాలపై ఫోకస్ పెట్టింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ కోసం దాఖలైన దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లాల వారీగా స్పెషల్ టీమ్స్ను ఏర్పాటు చేసుకోవాలని.. సిబ్బంది కొరత వుంటే ఇతర శాఖల నుంచి డిప్యూటేషన్పై తీసుకోవాలని సూచించారు. మొత్తానికి దరఖాస్తుల పరిశీలన పూర్తయింది. 60 వేల 2వందల అప్లికేషన్లకు ఆమోదం లభించింది. మిగతా వారికి మరో అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఐతే 2020 అక్టోబర్ 15లోపు దరఖాస్తు చేసుకున్న వాళ్లకే క్రమబద్దీకరణ అవకాశం కల్పించారు.