సిరా న్యూస్,కాణిపాకం;
చిత్తూరు జిల్లా కాణిపాకం స్వయం భు శ్రీ వరసిద్ది వినాయక స్వామి ని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు దర్శించుకున్నారు.కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి ఆలయం వద్దకు చేరుకున్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధికారులు స్వాగతం పలికారు.అనంతరం వర సిద్ది వినాయక స్వామి వారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించి ఆశీస్సులు అందుకున్న అనంతరం ఆలయ వేద ఆశీర్వాద మండపంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు వేద పండితులు వేద ఆశీర్వాదం అందిం చగా, పూతలపట్టు శాసన సభ్యులు మురళీమోహన్ శేష వస్త్రంతో సత్క రించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. అనంత రం అతిధి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ… అసెంబ్లీ స్పీకర్ గా భాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని, తిరు చానూరు పద్మావతి అమ్మవారిని, కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకోవడం జరిగిందన్నారు. నష్టపోయిన రాష్ట్రానికి భవిష్యత్తు ఇవ్వాలని దేవుని కోరుకోవడం జరి గిందన్నారు.. గత ఐదు సంవత్సరా లుగా రాష్ట్రం దోపిడిదారుల వలన నాశనమైందని, అన్ని రంగాల్లో రాష్ట్రం బాగుపడాలని కోరడం జరిగిందన్నారు.