సిరాన్యూస్, ఖానాపూర్
ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్కు రాఖీ కట్టిన మంత్రి సీతక్క
హైదరాబాదలోని రాష్ట్ర అసెంబ్లీ ఛాంబర్లో తెలంగాణ రాజ్యసభకు అభిషేక్ మను సింఘ్వీ నామినేషన్ వేయడానికి సీఎం రేవంత్ రెడ్డి తో పాటు మంత్రులు,వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో పాటు ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ సైతం వెళ్ళారు. సోమవారం రాఖీ పండుగను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్,శిశు,రూరల్ డెవలప్మెంట్ శాఖ,జిల్లా ఇంచార్జి మంత్రి డా.ధనసరి అనసూయ సీతక్క , తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గుప్తాలు ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ కు రాఖీలను కట్టారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ అన్నా,చెల్లెల అనురాగాలకు,అక్క-తమ్ముళ్ల అనుబందానికి రక్షా బంధన్ పండుగ ప్రతికగా నిలుస్తుందని పేర్కొన్నారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే రాష్ట్ర,జిల్లా,నియోజకవర్గ ప్రజలకు రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు.