సిరాన్యూస్,సైదాపూర్:
సైదాపూర్ లో ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు
సైదాపూర్ మండల కేంద్రంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేసి బాణసంచా కాల్చారు. రాజీవ్ గాంధీ అమర్రహే, జోహార్లు అంటూ నినాదాలు చేసి సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు గొంతు సుధాకర్, జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుండారపు శ్రీనివాస్ మాట్లాడుతూ దేశానికి దిశా నిర్దేశం చేసిన మార్గదర్శకులలో రాజీవ్ గాంధీ ఒకరని వారు గుర్తు చేశారు. గ్రామ పంచాయతీలను బలోపేతం చేయడం తోపాటు మహిళలకు రిజర్వేషన్లు కల్పించారని గుర్తుచేశారు. చిన్న వయస్సులోనే ప్రధానిగా బాధ్యతలు చేపట్టి యువతకు ఆదర్శంగా నిలిచారన్నారు. ఆనాడు రాజీవ్ గాంధీ చేసిన కృషితోనే ఐటీ అభివృద్ధి చెందిందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, గ్రామశాఖ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ ఎస్ యు ఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.