సిరాన్యూస్, సామర్లకోట
డ్రైనేజీ పూడికతీత పనులను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ రామారావు
వర్షాకాలంలో డ్రెయినేజీలు అస్తవ్యస్తంగా ఉండటంతో దోమలు, ఈగలు చేరి ప్రజలు జ్వరాల భారిన పడే పరిస్థితి ఉందని, ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా డ్రెయినేజీలో పూడిక తీయిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ రామారావు అన్నారు. మంగళవారం సామర్లకోట పట్టణ పరిధిలోని మేజర్ డ్రైనేజీలో పూడికతీత పనుల కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్బంగా మున్సిపల్ కమిషనర్ రామారావు మాట్లాడుతూ పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయలు చినరాజప్ప చొరవతో సామర్లకోట పట్టణ పరిధిలో మేజర్ డ్రైనేజీలో పూడిక తీయడానికి సుమారుగా 36 లక్షల రూపాయలు నిధులు తీసుకురావడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా 25వ వార్డ్ విగ్నేశ్వర థియేటర్ వెనక ఉన్న మేజర్ డ్రైనేజీ పూడికతీత పనులు చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో సామర్లకోట పట్టణ అధ్యక్షులు అడబాల కుమారస్వామి,మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్,రైతు సంఘ నాయకులు కంటే జగదీష్ మోహన్,కౌన్సిలర్ బలుసు వాసు,ఎండి సైపుల్ల, త్రిమూర్తులు,తదితరులు ఉన్నారు