సికింద్రాబాద్ లో భారీ వర్షం

తప్పని అవస్థలు
 సిరా న్యూస్,సికింద్రాబాద్;
రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి సికింద్రాబాద్, బేగంపేట, రాంగోపాల్ పేట, మోండా మార్కెట్, బన్సీలాల్ పేట్, పద్మారావు నగర్,సీతాపల్ మండి, బౌద్ధ నగర్,అడ్డగుట్ట తోపాటు కంటోన్మెంట్ మారేడ్ పల్లి, కార్ఖనా, .బోయిన్ పల్లి, తిరుమల గిరి పలు ఏరియాల్లో భారీ వర్షం కురిసింది. బేగంపేట, బ్రాహ్మణ వాడి,, ప్రకాష్ నగర్, సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్..నాలా బజార్ మోకాళ్ళ లోతు వరకు వచ్చిన వరద నీటితో స్థానికులు అవస్థలు పడుతున్నారు ప్రభుత్వ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని వల్లనే ఇలాంటి ఇబ్బందులకు గురవుతున్నారని మోండామార్కెట్ కార్పొరేటర్ కొంతం దీపిక మండిపడ్డారు. తాము ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించినట్టు కార్పొరేటర్ అన్నారు ఇకనైనా జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రాపాలి దృష్టి సారించి ఎమర్జెన్సీ కోటా కింద నిధులు మంజూరు చేసి ఇబ్బందులు తొలిగేవిధంగా చూడాలని కోరుతున్నట్టు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *