వెలుగొండ ప్రాజెక్టు గురించి అర్హత జగన్ కు లేదు

సిరా న్యూస్,విజయవాడ;
రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మీడియా తో మాట్లాడారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్ కి వెలుగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు కొట్టుకుపోతే ఆ గేటు పెట్టలేని జగన్ చంద్రబాబు గురించి మాట్లాడటం సిగ్గుచేటు. ప్రాజెక్టు పూర్తి కాకుండానే పూర్తి చేసినట్టు జాతికి అంకితం చేసి ప్రజాధనం దుర్వినియోగం చేసింది జగన్ కాదా? జగన్ టన్నెల్ డయామీటర్ రెండున్నర మీటర్లు తగ్గించారు. గత ఐదేళ్లలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వలేకపోయారని జగన్ పరోక్షంగా ఒప్పుకున్నారు, ఈ పాపం జగన్ ది కాదా ? 2019లో జగన్ మాయమాటలు నమ్మి ప్రజలు గెలిపిస్తే వారిని మోసం చేశారు. ఈసారి ప్రకాశం జిల్లా ప్రజలు జగన్ ఫేక్ ప్రచారాన్ని తిప్పి కొట్టారు. ప్రజలు బుద్ధి చెప్పినా జగన్ తన తీరు మార్చుకోకుండా పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు. జగన్ ఇకనైనా తప్పుడు ప్రచారం మానుకోవాలని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *