సిరా న్యూస్,హైదరాబాద్;
మూసారాంబాగ్ అలీ కేఫ్ చౌరస్తా వద్ద హుస్సేన్ సాగర్ వరద నీటి ప్రాంతాల వరద నీటి పరిస్థితిని అంచనా వేస్తూ జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ మారుతి దివాకర్ మీడియాతో మాట్లాడుతూ వివిధ పనుల నిమిత్తం బయటకు వస్తున్న ప్రజలను అప్రమత్తం చేస్తూ మాట్లాడారు. ఎలాంటి సమస్య ఉన్న ఎలాంటి ఇబ్బందులు ఉన్న వర్షం వల్ల అనవసరంగా బయటికి రావద్దని హెచ్చరించారు. రానున్న రెండు రోజుల్లో సైతం మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందులో ప్రజల అప్రమత్తంగా ఉండాలని అయన సూచించారు.
మరోవైపు, ఉప్పల్, రామంతాపూర్, చిలకానగర్, బోడుప్పల్, పీర్జాదిగూడ, మేడిపల్లి, పోచారం, ఘట్ కేసర్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వర్షం ధాటికి రోడ్లు జలమయం అయ్యాయి. ఉదయమే స్కూళ్ళు , కాలేజీలు , వ్యాపారం , ఉద్యోగం నిమిత్తం వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లోని మల్లికార్జున్ నగర్ రోడ్లులో మోకాళ్ళ లోతు చేరిన వర్షపు నీటితో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
ఎల్బీనగర్ లోని చింతలకుంట జాతీయ రహదారి మరియు మన్సురాబాద్ నాగోల్ బండ్లగూడ రోడ్లో భారీగా వర్షం నీరు చేరింది అదేవిధంగా చైతన్యపురి పోలీస్ స్టేషన్ లోకి వరద నీరు చేరడంతో బకెట్లతో పోలీసులు ఎత్తిపోయడం జరిగింది, వర్ష ప్రభావం ఎక్కువ ఉండడంతో ఈరోజు స్కూలుకు సెలవు ప్రకటించినట్టు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేయడం జరిగింది.