DCCB Chairman Addi Bhoja Reddy: రాజీవ్ గాంధీ సేవ‌లు మరువ‌లేనివి: డీసీసీబీ చైర్మెన్ అడ్డి భోజారెడ్డి

సిరాన్యూస్‌, ఆదిలాబాద్
రాజీవ్ గాంధీ సేవ‌లు మరువ‌లేనివి: డీసీసీబీ చైర్మెన్ అడ్డి భోజారెడ్డి
* కంది శ్రీ‌నివాస రెడ్డి క్యాంపు కార్యాల‌యంలో రాజీవ్ గాంధీ జ‌యంతి వేడుక‌లు

మాజీ ప్ర‌ధాని రాజీవ్ గాంధీ సేవ‌లు మ‌రువ‌లేనివ‌ని డీసీసీబీ చైర్మెన్, కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు అడ్డి భోజారెడ్డి అన్నారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కంది శ్రీ‌నివాస‌రెడ్డి క్యాంపు కార్యాల‌యం ప్ర‌జాసేవా భ‌వ‌న్ లో మాజీ ప్ర‌ధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 80వ జ‌యంతి వేడుక‌ల‌ను ఘ‌నంగా జ‌రుపుకున్నారు. ఈసంద‌ర్బంగా ఆయ‌న చిత్ర ప‌టానికి కాంగ్రెస్ పార్టీ నాయ‌కుల‌తో క‌లిసి పూల‌మాల‌లు వేసి ఘ‌న నివాళులు అర్పించారు. ఆయ‌న దేశానికి అందించిన విశేష సేవ‌ల‌ను కొనియాడారు. ఈ సంద‌ర్భంగా అడ్డి భోజారెడ్డి మాట్లాడుతూ పేద‌, బ‌డుగు, బ‌ల‌హీన‌వ‌ర్గాల పెన్నిధిగా వారి అభివృద్ధి, సంక్షేమం కోసం విశేష కృషి చేశార‌న్నారు. ఆయ‌న హ‌యాంలోనే దేశం శాస్త్ర‌సాంకేతిక రంగాల్లో పురోగ‌తి సాధించింద‌ని గుర్తు చేశారు. ఇవాళ ప‌ల్లెప‌ల్లెకు ర‌హ‌దారులు వేడ‌యం ఆయ‌న తీసుకొచ్చిన సంస్క‌ర‌ణ‌లేన‌న్నారు.వారిది త్యాగాల కుటుంబ మ‌ని పేర్కొన్నారు. ప్ర‌తిఒక్క‌రూ రాజీవ్ గాంధీ ఆశ‌యాల‌కు అనుగుణంగా న‌డుచుకోవాల‌ని, అభివృద్ధి వైపు పురోగ‌మించాల‌ని పిలుపునిచ్చారు.ఈ కార్య‌క్ర‌మంలో కౌన్సిల‌ర్లు సందా న‌ర్సింగ్ , జ‌ఫార్ అహ్మ‌ద్ , తూర్పటి భూమన్న,నాయ‌కులు తుమ్మ‌ల వెంక‌ట రెడ్డి , పోరెడ్డి కిష‌న్ దేవిదాస్ చారి . యెల్టి భోజారెడ్డి,ష‌కీల్,ర‌ఫీక్ . మ‌హాకాల్ అజ‌య్ ,ఖ‌య్యూం, రూప రోస్లిన్ ,శ్రీ‌లేఖ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *