సిరాన్యూస్, పెంబి
పెంబిలో బీఆర్ఎస్ నాయకుల నిరసన
రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ అందజేయాలని బీఆర్ బీఆర్ఎస్ నాయకులు అన్నారు. నిర్మల్ జిల్లా పెంబి మండల కేంద్రంలో మంగళవారం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి బిఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసన తెలిపారు. ఈసందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ షరతులు లేకుండా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని, బ్యాంకులో అప్పు ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే అర్హులైన రైతులందరికీ పూర్తిస్థాయిలో రుణమాఫీ అందజేయాలని కోరారు. అనంతరం స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.