P. Upender Reddy: కేయూపీఎంఏ సంఘం పటిష్టతకు కృషి: కేయూపీఎంఏ సంఘం అధ్య‌క్షులు పి.ఉపేంద‌ర్‌రెడ్డి

సిరాన్యూస్‌, బేల‌
కేయూపీఎంఏ సంఘం పటిష్టతకు కృషి: కేయూపీఎంఏ సంఘం అధ్య‌క్షులు పి.ఉపేంద‌ర్‌రెడ్డి

కేయూపీఎంఏ సంఘం ప‌టిష్ట‌త‌కు కృషి చేస్తాన‌ని అధ్య‌క్షులు పి.ఉపేంద‌ర్‌రెడ్డి అన్నారు. మంగ‌ళ‌వారం కేయూపీఎంఏ సర్వ సభ్య సమావేశం హన్మకొండలో అధ్యక్షులు పి. ఉపేందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈసంద‌ర్బంగా కళాశాలల యాజమాన్య స‌భ్యులు పాల్లొన్నారు. ఆర్‌టీఎఫ్ సాధనలో రాష్ట్ర కమిటీ సూచించిన అన్ని కార్యక్రమాలు ఏకగ్రీవంగా పాటిస్తూ సంఘం పటిష్టతకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుత సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర కమిటీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని అని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈసంద‌ర్బంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అవలంభిస్తున్నఆర్‌టీఎఫ్ విధానం వలన అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఇక కళాశాలను నిర్వహించే పరిస్థితిలో లేమని, కళాశాలలను బందు పెట్టుకునే అనివార్య పరిస్థితిని ప్రభుత్వమే కల్పిస్తోంద‌ని ఆరోపించారు. ఆర్‌టీఎఫ్ సాధన కోసం రాష్ట్ర కమిటీ కళాశాలల నిర్ణయంతో ఏకీభవించడానికి ఏకగ్రీవంగా తీర్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు సూర్యనారాయణ రెడ్డి, ఫౌండర్ ప్రెసిడెంట్ సుందర్ రాజు ,సెక్రటరీ యాదా రామకృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీధర్ రావు, కేయూపీఎంఏ సెక్రటరీ ప్రభాకర్ రెడ్డి, ట్రెజరర్ వేణు మాధవ్, యాజమాన్య సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *