Tehsildar Shyamsunder : ఈనెల 22న ఇసుక వేలం పాట:  తహసీల్దార్ శ్యాంసుందర్

సిరాన్యూస్‌, జైన‌థ్‌
ఈనెల 22న ఇసుక వేలం పాట:  తహసీల్దార్ శ్యాంసుందర్

జైనథ్ మండల‌ తహసీల్దార్ కార్యాలయంలో ఈనెల 22న ఇసుక వేలం పాట నిర్వ‌హిస్తున్న‌ట్లు తహసీల్దార్ శ్యాం సుందర్ తెలిపారు. బుధ‌వారం ఆదిలాబాద్ జిల్లా జైన‌థ్ మండ‌ల త‌హ‌సీల్దార్ కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. ఈనెల 22న ఉదయం 11:00 గంటల నుండి 1:00 వరకు జైనథ్ మండలం తహసీల్దార్ కార్యాలయంలో జైనథ్ గ్రామంలో డంపు చేయబడిన ఇసుక వేలం పాట నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. ఈ వేలం పాటలో ఆదిలాబాద్ జిల్లాలో లోని వివిధ మండలాల ప్రజలందరూ పాల్గొన వ‌చ్చ‌ని తెలిపారు.ఈవేలం పాటలో పాల్గొని ఎవరు ఎక్కువ ధరకు వేలం పాట పాడి డబ్బు చెల్లించిన వారికి ఇసుక స్వాదీన పరుచుబడును తెలిపారు. వేలం పాట జరిగిన రోజు నుంచి ఈనెల 25 సాయంత్రం 5గంటల వరకు వేలం పాటలో గెలిచిన వ్యక్తి నిర్ణిత సమయం లోగా డబ్బు చెల్లించని ప‌క్షం ఈ వేలం పాట రద్దు చేయ‌బ‌డుతుంద‌ని తెలిపారు. మరో వేలం పాట నిర్వహించ‌నున్న‌ట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *