సిరా న్యూస్,మేడ్చల్;
మేడ్చల్ పట్టణంలో గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఓ భవనం కుప్పకూలిపోయి ప్రమాదంలో ఉంది. మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని గత 5 సంవత్సరాల నుండి గర్మాపూర్ వెళ్లే దారి లో రైల్వే బ్రిడ్జి పనుల చేపట్టారు. గిర్మాపూర్ వెళ్లడానికి తాత్కాలికంగా అండర్ పాస్ రోడ్డు వేశారు. రైల్వే పనుల కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో దానికి పక్కనే ఉన్న జి ప్లస్ టు భవనం భారీ వర్షంతో వల్లన భవనం చుట్టుపక్కల ఉన్న మట్టి కొట్టుకుపోయింది. దీంతో ఉదయం మేడ్చల్ మున్సిపల్ చైర్ పర్సన్ మర్రి దీపిక నరసింహారెడ్డి ,మేడ్చల్ మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి సందర్శించి భవనంలో ఉన్న వారందరిని ఖాళీ చేయించారు. ఏ క్షణమైనా భవనం కూలిపోతుందని చుట్టుపక్కల ఉన్న స్థానికులను అప్రమత్తం చేశారు.
==================