BOATH: వైరల్ జ్వరాలతో మంచం పట్టిన బోథ్‌

సిరాన్యూస్‌, బోథ్‌
వైరల్ జ్వరాలతో మంచం పట్టిన బోథ్‌
* స్థానికంగా వైద్యం అందక ప్రైవేట్‌ దవాఖానలకు పరుగులు

ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్‌కు జ్వరమొచ్చింది. ఇక్కడా, అక్కడా అని తేడా లేకుండా ఇంటింటా విషజ్వరాలు, సీజనల్ వ్యాధులతో జనం సతమతం అవుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో బాధితుల సంఖ్య పెరుగుతోంది. బోథ్ మండ‌లం వ్యాప్తంగా వైరల్ జ్వరాలు వెంటాడుతున్నాయి. దీంతో ఆసుపత్రిల‌కు రోజూ వంద‌లా మంది ఔట్ పేషెంట్లు క్యూకడుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళుతున్నవారి సంఖ్య మరింత ఎక్కువగా ఉంటోంది. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి కేసులూ నమోదవుతున్నాయి. వాతావ‌ర‌ణంలో మార్పులు, వ‌ర్షాల‌కు వాగులు, వంక‌లు పొంగిపొర్ల‌డం, ప‌ల్లెల్లో క‌నీసం బ్లీచింగ్ కూడా చ‌ల్ల‌ని ప‌రిస్థితుల‌తో వైర‌ల్ ఫీవ‌ర్లు విజృంభిస్తున్నాయి. దీనికి తోడు దోమల బెడద తీవ్రంగా ఉండడంతో ప్రజలు వైరల్, మలేరియా జ్వరాల బారిన ప‌డుతున్నారు. మండల కేంద్రంలో గత వారం రోజుల క్రితం వైద్య శిబిరం నిర్వహించిన వ్యాధుల ఉధృతి తగ్గలేదు. మరోవైపు రోగులకు సరిపడా బెడ్లు లేకపోవడంతో మరో వైపు మందులు లేకపోవడంతో రోగులు ఇతర పట్టణాలకు వెళ్లి వైద్యం చేయించుకుంటున్నారు. ఇప్ప‌టికైనా జిల్లా అధికారులు వ్యాధుల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *