సిరాన్యూస్, బోథ్
బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రానికి చెందిన ఎంపీడీవో సుశీల్ రెడ్డి తండ్రి ఇటీవల మృతి చెందారు. ఈవిషయం తెలుసుకున్నబోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బుధవారం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే అల్లా కొండ పోతన్న తండ్రి మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని, అనంతరం రామ్ రెడ్డి గుండయ్య సతీష్ రోడ్డు ప్రమాదంలో గాయ పడ్డ నాయకపు గంగామనిని ఎమ్మెల్యే పరామర్శించారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్, కన్వీనర్ నారాయణరెడ్డి, మాజీ జడ్పీటీసీ డాక్టర్ సంధ్యారాణి, తదితరులు పాల్గొన్నారు.